కిలో విత్తనాన్ని 100  మి. లీ  ఘాడ ఘందకికామ్లం లో 2-3 నిముషాలు నానబెట్టిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. తర్వాత తగినంత తుమ్మ జిగురు కలిపి  5 గ్రాముల ఇమిదక్లోప్రిడ్  70 డబ్లు యస్  లేద  4 గ్రాముల థయమితక్షం లేద  50 గ్రాముల కర్బోసల్ఫాన్ తో విత్తనశుద్ధి చేసి  విత్తితే  30-40 రోజులవరకు రసం పీల్చే పురుగులను నివారించవచ్చు.  ఎ ప్రాంతాలలో బాక్తిరియ నల్లమచ్చ తెగులు ఉదృతంగా ఉన్నదో ఆ రైతులు ఒక లీటర్ నీటిలోనికి 100 మి. లీ. పోశోమైసిన్ లేదా ప్లన్తోమైసిన్  లేదా మూడు గ్రాముల బ్లితొక్ష్ తో కలిపి 6-8 గంటలవరకు నానబెట్టి నీడలో ఆరబెట్టాలి.   

ట్రైకోడెర్మ తో విత్తనశుద్ది ;

ఒక కిలో విత్తనానికి ఐదు గ్రామూలా త్రికోడెర్మ విరిడే  పొడిని మరియు  యాబై గ్రాముల బెల్లాన్ని కలిపి నీడలో ఆరబెట్టాలి. దీని వలన శిలంద్రాల వలన వచ్చే తెగులును అరికట్టవచ్చు.